పైడితల్లమ్మ అమ్మ వారి పండుగ

దాకమర్రి పండగలు : ఊరి పండగ 

   దాకమర్రి గ్రామం విజయనగరం జమిందారు వారి ఏలుబడిలో ఉండేది. 1757 సంవత్సరంలో జరిగిన బొబ్బిలియుద్ధంలో అటు బొబ్బిలి వంశం , ఇటు విజయనగర రాజులు ఇరువురు హతమైనప్పుడు విజయనగర రాజు అయినటువంటి విజయరామరాజు సోదరి పైడిమాంబ తమ రాజ్యం ఫ్రెంచ్ వారి హస్తగతం అవ్వడం ఇష్టపడక పరాయి రాజ్యం లో తను జీవించటానికి మనసును చంపుకొని, జీవించలేక తను నిత్యం ఆరాదించే విజయవాడ కనకదుర్గ లో కలిసిపోయి విజయనగరంలోని పెద్ద చెరువులో బంగారు విగ్రహరూపంలో వెలసింది. నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుంది.



  ఆ రోజు నుండి విజయనగరం సంస్థానంలో భక్తులు కోర్కెలను తీరుస్తూ, భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ దాకమర్రి నుండి కూడా ప్రతి సంవత్సరం ప్రజలు 7 పెద్ద కుటుంబాల 7 ఎడ్ల బళ్ళను అందంగా అలంకరించి ఆ తల్లికి మొక్కులు తీర్చుకోడానికి వెళ్ళి వచ్చేవారు. కాలక్రమంగా విజయనగరంలో స్వాతంత్ర్యనికి ముందు బ్రిటీష్ వారు పండగలు నిర్వహణ వలన ప్రజలలో ఐక్యమత్యం పెరుగుతుందని, తిరుగుబాట్లు జరగవచ్చని కారణంతో ప్రజల రాకపోకలు నియంత్రించారు. రాకపోకలకు ఇబ్బంది కల్గించిన కారణంతో ప్రజలు తమ మొక్కులు తీర్చుకోడానికి అనేక ఇబ్బందులకు గురి అయ్యేవారు. ఆ తల్లి కరుణ మీరు మీ మ్రొక్కులను మీ గ్రామంలో నుండి తీర్చుకోండి అని చెప్పి చైత్ర మాసంలో పౌర్ణమి ఘడియలలో సోమ , మంగళ , బుధ వారాలలో మీ 7 బళ్ళను రధాలుగా మీ ఊరు చుట్టూ ప్రదక్షణగా ఊరి మధ్యలో గుడి కట్టి ఊరికి నైరుతిన శక్తి పీటం (సదురు) (వనం గుడిని) మీ స్థాయిలో ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అని ఆనతిని ఇవ్వగా నాటి నుండి ఊరు జమిందారులు అయిన నాయిడోరు ఆధ్వర్యంలో పండుగలు జరుగగా 7 పెద్ద కుటుంబాలు సమక్షంలోని 
1 కాళ్ళ 
పండగ లో మొదటి ఘటం , మొదటి రధం , మొదట బాలి ఇచ్చే పోతూ ఇలా అన్ని సందర్బాలలో మొదటిది కాళ్ళ వారిదే కావడం విశేషం.
2 మొకర  
కంటుభుక్త + బక్క
రంగుబుక్త
సంకురుభుక్త
6 కంటుభుక్త
7 ముద్దాడ



రధాలను వేరు వేరు రూపాలలో అలంకరించి ఆ తల్లికి తమ మొక్కులను తీర్చుకొని ఆ తల్లి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగ 30 రోజులు ముందుగ చాటింపు వేసి, 15 రోజులు ముందుగా వనం గుడికి భక్తులు ఊరేగింపుగా వెళ్ళి దివిటీల వెలుగులో అమ్మవారిని ఊరేగింపుగా భక్తులు ప్రధాన ఆలయానికి తీసుకొని వస్తారు. అమ్మ వారు ఉగాది పండగ రోజున పంచగా శ్రవణం చేసిన తర్వాత భక్తులను తరింపచేయడానికి వంది మగాదులు వెంట పెట్టుకొని ఊరేగింపుగా దాకమర్రి గ్రామ అనుబంద గ్రామాలకు జోగిగా వెళ్ళి  పాడిపంటలను, పిల్లలను నాడు దుర్గలో ఐక్యం కాక మునుపు పైడిమాంబ నడియాడిన ప్రదేశాలను ఆమెకు చూపిస్తూ సాయంత్రానికి సతకం (రచ్చబండ) వద్దకు చేరి ప్రజలు వారు ప్రవర్తిస్తున్న తీరుపై వాలకాలు వ్యంగ్యంగా విమర్శలు ఉంటాయి. ఈ విధంగా పౌర్ణమి దగ్గరి సోమవారం తోలెలు (అనగా మొదటి పూజను) 7 రధాలను ఒక్కసారి తిప్పి నిర్వహణ చేస్తారు. రెండవ రోజైన మంగళవారం  ప్రధాన పూజను నిర్వహించి సాయంత్రం ప్రజలు ఘటాలతో పాటు, 7 రధాలు (3 సార్లు ) , పాలధార (సైన్యం)తో ఊరు మొత్తం తిరిగి ప్రధాన ఆలయంకు చేరుస్తారు. తదుపరి 15 రోజులు తరువాత అమ్మవారి అనుపు (ఉయ్యాల కంబాల) నిర్వహణతో పండగ ముగుస్తుంది.
  గత 20 ఏళ్ళుగా  పండుగను నాయిడోరుతో పాటు గ్రామ పెద్దగా ఉన్న చెల్లూరి పైడప్పడు గారు కలిసి నిర్వహిస్తున్నారు.

నాటి నుండి పండుగను నేటి వరకు ప్రజలు తమ జీవనార్ధం ఎచ్చటకు వెళ్ళిన ఆ మూడు రోజులు తమ ఇళ్ళకు వచ్చి భక్తి శ్రద్ధలతో , ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు.



దాకమర్రి చరిత్ర

" Dakamarri.Com " మా వెబ్ సైట్ ప్రారంభించటానికి కారణం వెబ్ ప్రపంచంలో మరొక వెబ్ సైట్ పెంచటం కాదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండి ఇంకా అభివృది చెందకుండా, అట్టడుగున ఉన్న ఈ ఊర్లో పుట్టి బ్రతకాలంటే విజయవాడకో , వైజాగ్ కో వలస వెళ్లి సొంత ఊరితో సంబంధం లేక ఎంత ఎదిగిన, మనసున మన ఊరికి దూరం అయ్యారన్న భావనలో నిరాశకు గురి అవుతున్న మన వారి కోసం , మన అభివృది కి కొత్త దారులు కోసం , కొత్త అవకాశాల కోసం మన మధ్య కొత్త వారధిని నిర్మిస్తున్నాం. అదే  Dakamarri.Com (దాకమర్రి డాట్ కామ్)

దాకమర్రి : -

 భారతదేశంలో ఉన్న కొన్ని వేల గ్రామాలలో దాకమర్రి ఒకటి మరి దాకమర్రి కి ఒక సొంత చరిత్ర ఉంది.భారత సంస్కృతిలో ఉన్న భిన్నత్వం భావనలో ఏకత్వంకు దీన్ని సాద్యం చేసింది.

గ్రామీణ భారతంలో దాకమర్రికి ఉన్న ప్రాదాన్యతను ప్రపంచం గుర్తించాలి అనే మా ప్రయత్నం ...
పూర్వం ఈ ప్రాంతంలో దక్షప్రజాపతి అయిన దక్షుడు వైభవోపేతంగా యజ్ఞం చేయదలచి యజ్ఞానికి సకల దేవతలను పిలిచి తన కూతురైన సతిదేవిని ఆమె పతి శివుడిని ఆహ్వానించలేదు. అయినను సతీదేవి జన్మనిచ్చిన తండ్రి కొరకు శివుడు మాట కాదని యజ్ఞానికి వెళ్ళింది.అక్కడ దక్షుడు తన కూతురు సతీదేవిని అవమానించాడు.  ఈ అవమానం కారణంగా సతీదేవి తండ్రి కళ్ళ ముందు ప్రాణ త్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపం దాల్చి వీరభద్రునిగా దక్ష ప్రజాపతిని వదించాడు. నాటి నుండి ఈ ప్రాంతం ఉగ్రరూపంగా మారింది. శాంతి కొరకు విష్ణువు ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారిగా అవతరించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్లు అనుగ్రహించారు. దక్షయజ్ఞ భంగం జరిగిన ప్రదేశం కావున దక్షమారి అని పిలవబడి కాలాంతరంలో దాకమర్రిగా రూపాంతరం చెందింది.


గ్రామ చరిత్ర : -

దాకమర్రి సుమారు 3000 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. నాటి నుండి ఈ ఊరి పేరు దాకమర్రి (దక్షమర్రి ) గానే ఉంది. చరిత్రలో ఇది అతి గొప్ప అరుదైన విషయం. కాల గమనంలో నాగరికత మార్పులకు పేర్లు మారుతూ ఉంటాయి కానీ మారలేదు. ఇదే విషయం ఇక్కడ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో లభ్యమైన శిలా శాసనం వలన తెలుస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఒక రాయి పైన కమల పువ్వు గుర్తు ప్రకారం ఈ గ్రామం అశోకుని కాలం నాటికి ఉండి పశ్చిమం నుండి వచ్చే వర్తకులకు వ్యాపార కూడలిగా ఉండేదని దీని ద్వారానే తూర్పు దేశాలలో గోపాలపట్నం (నేటి విశాఖపట్నం) , భీమునిపట్నం ఓడరేవులు ద్వారా వ్యాపారం జరిగేదని తెలుస్తుంది.



శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో శిలా శాసనం , నిర్మాణ శైలి పరిశిలించి పరిశోదన జరిపిన ఆంద్ర యూనివర్సిటీ A.U. ఆచార్యులు ఈ గ్రామంలో ప్రముఖ శైవ క్షెత్రంగా ఉండినది అని 1071 సంవత్సరంలో చోళ నిర్మాణ శైలిలో నిర్మాణం జరిగిన ఆలయం 1071 న ఉన్నతి పొంది తదుపరి ఏ కారణం చేతనో అంతర్దానం అయినది.

ఈ అంతర్దానం వెనుక తదుపరి వచ్చిన శ్రీ వైష్ణవం ప్రభావం ఉందని కచ్చితంగా చెప్పలేమని ఎందుకంటే 1071 సంవత్సరంలోని శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంకి కూడా అదే దాత దానం జరిపారని తమిళనాడు మాదిరి ఇక్కడ శైవ , వైష్ణవ మత ఘర్షణలు కానరావు అని మత సామరస్యం ఉండినది అని కచ్చితంగా చెప్పవచ్చు.

దాకమర్రి గ్రామంలో పురాతన శైవ దేవాలయం కనుమరుగు అయ్యి ఆ శివలింగ రూపంలో ( శ్రీ దాకమర్రి దాక్షయణ మహాదేవర ) ప్రస్తుతం దాకమర్రి రెవిన్యూ పరిధిలోని మజ్జిపేట గ్రామంలో పుజాదికాలను అందుకొనుచున్నారు.

ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయం పునరుద్దరింపబడి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి.

ఈ ఆలయాల శిధిలం 1360 సంవత్సరంలో జరిగిన తురస్కుల దండయాత్ర కారణం కావచ్చు అని ఎందుకంటే 1360 - 1475 వరకు సరైన పాలకుడు ఈ ప్రాంతంలో లేకపోవటం కారణం కావచ్చు.


నాటి చరిత్ర : -
        తురస్కుల దాడుల అనంతరం కూడా సుమారు 140 కుటుంబాల వరకు వైష్ణవులు ఉండేవారని రెండు వీధులుగా మిద్దె పూరిళ్ళు ఉండేవని వారి కుటుంబాలలో పెద్ద కుటుంబం అయిన " పైడిపాటి " లక్ష్మి వల్లభ నారాయణాచార్యులు కుటుంబీకులు వద్ద అనేక తాళపత్ర గ్రంధాలు ఉండేవని అవన్నీ 1850 - 1870 మద్య జరిగిన అగ్ని ప్రమాదం వలన నసించినవి అని తెలుస్తుంది.

వారే కాక భక్తి గీతాల ద్వారా వైష్ణవ మత ప్రచారం నిర్వహించే దాసుర్లు కూడా ఉండేవారు. వారు ఆలయం మూత పడిన తరువాత గ్రామ శివారులో ఉన్న నేటి దాసరిపేటకు అక్కడ నుండి S.కోట తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు.

తరువాత 1750 ప్రాంతంలో శ్రీకాకుళం , ఒరిస్సా , మహారాష్ట్రల నుండి నాగావంశీయులు వచ్చి దాకమర్రికి తిరిగి ప్రాభను తీసుకొనివచ్చారు.

మీ యెక్క విలువైన సలహాలను , సమాచారాన్ని మాకు తెలియజేయండి.
మెయిల్ ఐడి : Durgarao@dakamarri.com

Location Details


Mandal Name : Bheemunipatnam
District : Visakhapatanam
State : Andhra Pradesh
Region : Andhra
Language : Telugu
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude: 38 meters. Above Seal level
Telephone Code / Std Code: 08933
Pin Code : 531162
Post Office Name : Chittivalasa

How to Reach Dakamarri

Nearby Railway Stations

Korukonda- 12 KM
Vizianagram Jn- 15 KM
Alamanda- 15 KM
Kantakapalle- 23 KM

Places to Visit

Vizayanagaram- 15 KM
Visakhapatnam- 39 KM
Ananthagiri- 55 KM
Araku Valley- 76 KM
Jeypore- 147 KM

Dakamarri Nearby Places

Few nearby places of Dakamarri are listed below for your reference:

Cities

Bheemunipatnam- 13 KM
Vizianagaram- 15 KM
Visakhapatnam- 39 KM
Anakapalle- 58 KM

Taluks

Padmanabham- 6 KM
Bhoghapuram- 12 KM
Bheemunipatnam- 13 KM
Denkada- 14 KM

Airports

Vishakhapatnam Airport- 38 KM
Rajahmundry Airport- 217 KM
Vijayawada Airport- 359 KM
Bhubaneswar Airport- 400 KM

District Head Quarters



Vizianagaram- 16 KM
Visakhapatanam- 40 KM
Srikakulam- 70 KM
Koraput- 128 KM

About Dakamarri

Dakamarri is a Village in Bheemunipatnam Mandal in Visakhapatanam District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 41 KM towards North from District head quarters Vishakhapatnam. 14 KM from Bheemunipatnam. 614 KM from State capital Hyderabad

 దాకమర్రి గ్రామం భీమునిపట్నంమండలం , విశాఖపట్నం జిల్లాలో ఓ గ్రామం. మా గ్రామం గురించి చెప్పాలంటే...

జనాభా మొత్తం 5,059 - పురుషుల సంఖ్య 2,614 - స్త్రీల సంఖ్య 2,445 - గృహాల సంఖ్య1,067

ఉన్న ఊరు మా ఊరి ప్రజలు ముఖ్య ఆధారం వ్యవసాయం : కూలి పని. కానీ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది.

మా ఆవాస గ్రామాలు :
1 దాకమర్రి 2 నీలయమ్మ సత్రం  3 కాళ్ళ వారి కల్లాలు 4 దాసరి పేట 5 బుగత వారి కల్లాలు 6  అల్లు పేట 7 ముద్దాడ పేట 8 మీసాల పేట (రెల్లి పేట).

ఇవన్ని దాకమర్రిలో అంతర్బాగమే.

1 దాకమర్రి :
        దాకమర్రి పంచాయితీ మొత్తానికి ప్రదానమైన ఊరు. ఇక్కడే పంచాయితీ ఆఫీస్, పైడితల్లి అమ్మ వారి గుడి ,లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి (LVN)ఆలయం, ఆంజనేయస్వామి గుడి ,రామాలయం , రాజ్యలక్ష్మి తల్లి గుడి ఉన్నాయి. ఇక్కడ దాకమర్రి  M.P.P.E.P స్కూల్ ఉంది. దీనిలోనే ఊరిలో పిల్లలు ప్రాదమిక విద్యను అభ్యసిస్తున్నారు.పశువుల ఆసుపత్రిలో గ్రామంలోని పశువుల అన్నింటికీ వైద్య సదుపాయం ఉంది.అలాగే  పంచాయితీ మొత్తానికి ఎవరికి అనారోగ్యం కలిగిన R.M.P డాక్టర్ గెద్ద చిరంజీవి గారు 24/7 అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్ని కులాల ప్రజలు నివసిస్తున్నారు.రెండు రైస్ మిల్లులు , దాకమర్రి గ్రామ మొత్తానికి  నీటి సరఫరా కొరకు ట్యాంక్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం క్రింద వీధి , మద్య వీధి (రాజ వీధి) , పై వీధి (సతకం) , BC కోలని , SC కోలనిలు ఉన్నాయి.

2 నీలయమ్మ సత్రం :
             NH 43 నుండి దాకమర్రికి రోడ్ పై ఉన్నది.  నీలయమ్మ సత్రంలో  శ్రీ  కాకర్ల పూడి నీలయమ్మ  ఇక్కడ రోడ్ ప్రక్కన ఒక సత్రం నిర్మించి దాని ద్వారా బాటసారులకు (ప్రయాణికులకు) నీళ్ళు , వసతి ఏర్పాటు చేసింది. ఆమె పేరు పై ఈ సెంటర్ కు  నీలయమ్మ సత్రం అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ సత్రం దేవాదాయశాఖ వారి అద్వర్యంలో ఉంది. దాకమర్రికి విశాఖపట్నం , విజయనగరం , తగరపువలస నుండి రావాలన్న , వెళ్ళాలన్న  నీలయమ్మ సత్రం నుండి  బస్సులు , ఆటోలు ఉంటాయి.

3 కాళ్ళ వారి కల్లాలు :
             దాకమర్రిలోని కాళ్ళ వారిలో అప్పట్లో రెండు కుటుంబాలు పంట పొలాలకు దగ్గర ఇల్లు కట్టుకోవాలని తమ పంట పొలాల్లో (కల్లాలు) ఇల్లు నిర్మించుకొని వున్నారు. తరాలు గడిచిన తదుపరి 40 కుటుంబాల నివసిస్తున్నాయి.

4 దాసరి పేట :
         శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారిని వైష్ణవ భక్తి గీతాలతో భక్తి ప్రచారం చేసే దాసుర్లు తమకు రాజులు ఇచ్చిన ఈనాం భూములలో ఇల్లు నిర్మించుకొని 100 కుటుంబాలు ఉండేవి.దాసుర్లు ఉన్న ఊరు కనుక దాసరి పేట అని పేరు వచ్చింది.కాలక్రమేణ వారు జీవనాదారం కోసం S కోటకు వలస వెళ్ళి పోయినా ప్రస్తుతం ఇక్కడ మోదవలస నుండి తాలాడ వారి కుటుంబం , కనకల వారి కుటుంబం , దాకమర్రి నుండి ఎచ్చర్ల వారి కుటుంబాలు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నారు.

5 బుగత వారి కల్లాలు :
              బుగత వారి కుటుంబాలు కొన్ని నివసిస్తున్నాయి. ఇక్కడ దాకమర్రి గ్రామంలోని రంగుభుక్త వారి కుటుంబాలు కొన్ని ఇక్కడకు వచ్చి ఇల్లు నిర్మించుకొని వారే బుగత వారిని పోలిపిల్లి గ్రామం నుండి రప్పించి సుమారు 40 కుటుంబాలు ; బుగత ,రంగుభుక్త కుటుంబాలు నివసిస్తున్నాయి.

6 అల్లు పేట :
         దాకమర్రి గ్రామంలో ముద్దాడ పేటలో నివసించే యాదవులు ఇక్కడ తమ భూములలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అల్లు ఇంటి పేరు వలన అల్లు పేట అని పేరు వచ్చింది.

7 ముద్దాడ పేట :
           NH 43 ని ఆనుకోని ముద్దాడ  పేట గ్రామం ఉంది.  ఇక్కడ యాదవులు నివసిస్తున్నారు. దాకమర్రి యాదవులు ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్నారు. ముద్దాడ ఇంటి పేరు వలన ఆ పేరు వచ్చింది.

8 మీసాల పేట (రెల్లి పేట) :
             ఇక్కడ రెల్లి కులస్తులు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. మామిడి / జీడి తోటలను వేసవి కాలంలో కాపు కాసి పళ్ళను  అమ్మడం, మిగిలిన సమయంలో కూలి పని , వ్యవసాయం చేస్తుంటారు.

దాకమర్రిలో వ్యవసాయనికి  చెరువులే ఆధారం.

దాకమర్రిలో మొత్తం చెరువులు :

1 ఇల్లం దేవి చెరువు
2 కోమటి చెరువు
3 కొత్త చెరువు
4 అంకుశాని చెరువు
5 రామినేని చెరువు
6 నారాయణ చెరువు
7 మందుసాని చెరువు
8 మోకరవాని చెరువు
9 శ్రీలంక చెరువు
10 సీతయ్య చెరువు
11 రామయ్య చెరువు
12 సుడి చెరువు
13 గెడ్డ కట్టు చెరువు
14 తమయ్య కోనేరు 

 ఇప్పటివరకు దాకమర్రి సర్పంచ్ లు :
చెల్లూరి రంగారావు
పెంటపల్లి చిట్టిబాబు
చెల్లూరి క్రిష్ణ
కనకల పైడితల్లి
చెల్లూరి సదనందరావు
అల్లు అప్పలనాయుడు 
చెల్లూరి పైడప్పడు( ప్రస్తుతం )

 ఇప్పటివరకు దాకమర్రి M.P.T.C లు :
చెల్లూరి పైడప్పడు
చెల్లూరి వెంకటరావు ( చిన్నబాబు )
చెల్లూరి పైడప్పడు 
బుగత గౌరి 
చెల్లూరి నగేష్ ( ప్రస్తుతం )

Dakamarri Pin code is 531162 and postal head office is Chittivalasa .

Revidi ( 4 KM ) are the nearby Villages to Dakamarri. Dakamarri is surrounded by Anandapuram Mandal towards South , Bhoghapuram Mandal towards East , Bheemunipatnam Mandal towards South , Denkada Mandal towards North .

Bheemunipatnam , Vizianagaram , Visakhapatnam , Anakapalle are the nearby Cities to Dakamarri.

This Place is in the border of the Visakhapatanam District and Vizianagaram District. Vizianagaram District Bhoghapuram is East towards this place . It is near to bay of bengal. There is a chance of humidity in the weather.

OverView of Dakamarri

IS is a great place with different cultress and religions..here main occupation of the people is farming.........it a place u have the all the requirements .and population around 1000 and the people who stay in this village r respectble and respected.it has a good transport facility.and recently found in the village a temple which was built ed in 10 th centuary and article return in the stone .the god sri vallabha narayana swammy murthi temple.great to watch the temple and the village....had a facility of school for nursery and high school

గ్రామానికి రవాణా సౌకర్యాలు

విశాఖపట్నం నుండి విజయనగరం 211 బస్ రూటు లో ప్రతీ 20నిమిషాలకు బస్ ఉంది దాకమర్రి కి ఆపి దిగవచ్చు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

దాకమర్రి గ్రామం లో ప్రాచిన ఆలయం శ్రీ లక్ష్మీ వల్లభ నారయణ స్వామి ఆలయం ఉన్నది.ఈ ఆలయంలో లభించిన ఒక శిలాశాసనం వలన 1071వ సంవత్సరం నాటిదని తెలుస్తుంది ఈ ఆలయం ఎన్నో ఏళ్ళనాడు శిధిలం కాబడి 2008 సంవత్సరం లో సంకురుభుక్త ప్రకాష్  మరియు గ్రామం లోని యువకులు కలసి పునర్ నిర్మాణం చేసారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వల్లభ నారయణ స్వామి వారు ఇక్కడి ఆలయం లో కోలువై ఉన్నారు.


గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 5,059 - పురుషుల సంఖ్య 2,614 - స్త్రీల సంఖ్య 2,445 - గృహాల సంఖ్య1,067